కళ్యాణ లక్ష్మి చెక్కులను రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన - జడ్పీ చైర్ పర్సన్ వసంత,ఎమ

Published: Friday October 29, 2021

సారంగాపూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ కోనపూర్ గ్రామంలో డి.ఏం.ఎఫ్.టి 6 లక్షల 44 వేల నిధులతో నిర్మించే రైతు వేదిక భవన నిర్మాణానికి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఆడపడుచులకు మంజూరైన 24,02,784 లక్షల రూపాయల విలువగల చెక్కులను జడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పోతారం గ్రామానికి చెందిన రైతు ఇడగొట్టు నడిపి భీమయ్య అనారోగ్యంతో మరణించగా రైతు భీమా ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కును భీమయ్య కుటుంబ సభ్యులకు జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి తహశీల్దార్ శ్రీలత ఎంపీడీవో వాసల వెంకటేశం ప్యాక్స్ చైర్మన్లు మల్లారెడ్డి ఏలేటి నర్సింహారెడ్డి వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ సర్పంచ్లు ఆకుల జమున గుర్రాల రాజేందర్ రెడ్డి ఢిల్లీ రామారావు జోగినపల్లి సుధాకర్ రావు శేఖర్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు