సమాజ సేవలో నేను సైతం.!! కుమారుడి జన్మదినం పేదలకు దుప్పట్లు పంపిణి.

Published: Thursday December 08, 2022

చేవెళ్ల డిసెంబర్ 07. (ప్రజాపాలన):-
సమాజ సేవలో నేను సైతం అంటూ సేవా దృక్పథంతో చేవెళ్ల వాస్తవ్యులు అత్తెల్లి జగన్నాథ్ రెడ్డి తన రెండవ శ్రీనికేత్ మొదటి పుట్టినరోజు హంగులు ఆర్భాటాలు లేకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
బుధవారం చేవెళ్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ బండారు శైలజ చేతుల మీదుగా అందజేశారు. గ్రామ సచివాలయంలో కార్మికుల సమక్షంలో శ్రీ నికేత్ రెడ్డి చే  సర్పంచ్ కేక్ కట్ చేయించి నోరు తీపి చేసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...హంగులు ఆర్భాటాలు లేకుండా సేవాభావంతో  ముందుకొచ్చి తన కుమారుడు జన్మదినం సందర్భంగా కార్మికులకు దుప్పట్లు పంచాలనే ఆలోచన వచ్చిన జగన్ ని ముందుగా అభినందించారు. చలికాలం అవడంతో ఇబ్బంది పడుతున్న పేదలను దృష్టిలో ఉంచుకొని ఈ సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. భవాని,జగన్నాథ్ రెడ్డి దంపతులు గతంలో అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు విషయంలో చేసిన సేవలను గుర్తుచేసి వారు కొనియాడారు. సేవా భావంతో ముందుకెళ్లే వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ శైలజ కోరారు. అనంతరం ప్రభుత్వ వసతిగృహాలలో, పాఠశాలలలో, అంగన్వాడి కేంద్రాలలో విధులు నిర్వహించే వారికి, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని తను నివాసం ఉంటున్న ప్రాంతంలో మొక్కలను నాటారు. తమ జన్మదినం కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో తృప్తిని  కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో... పర్యావరణ పరిరక్షణ అవార్డు గ్రహీత, సామాజికవేత్త పి. రామకృష్ణారావు, ఉపసర్పంచ్ గంగి యాదయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్,పంచాయతీ సిబ్బంది నరేందర్ రెడ్డి, మద్దెల యాదయ్య, శ్రీకాంత్,బి. యాదయ్య వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.