ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన

Published: Wednesday April 13, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 12 ఏప్రిల్ ప్రజాపాలన : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పన కొసం ఉద్దేశించి మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి మండలంలోని రూప్ ఖాన్ పేట, సుల్తాన్ పూర్, బసిరెడ్డిపల్లి గ్రామాల పాఠశాలలను, నర్సరీలను సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రూప్ ఖాన్ పేట ఉన్నత పాఠశాలకు సంబంధించిన ఫ్లోరింగ్, విద్యుదికరణ, తలుపులు, కిటికీలు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, పైకప్పు మరమ్మత్తులు, త్రాగు నీటి సదుపాయంతో పాటు పాఠశాలకు రంగులు వేసేందుకు అవసరమైన ఖర్చుల అంచనాలను సిద్ధం చేసి త్వరగా పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో సుందరికరణ, పచ్చదనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా పనులను చేపట్టాలన్నారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులను పలకరించి వారి చదువు తీరును పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషలో విద్యను అభ్యశించనున్నందున ఉపాధ్యాయులు విద్యార్థులను ఆంగ్ల భాషలో తీర్చి దిద్దాలన్నారు. సుల్తాన్ పూర్ పాఠశాలలో మురుగు నీరు నిలువకుండ చూడాలని సూచించారు. గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించి పారిశుధ్యం పనులను చేపట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఉన్నత పాఠశాల భవనముపై అదనపు తరగతి గదుల నిర్మాణం కొరకు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారిని కోరారు.  అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి టీచర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూప్ ఖాన్ పేట్, బసిరెడ్డి పల్లి గ్రామాలలో నర్సరీలను పరిశీలించారు. బసిరెడ్డిపల్లి నర్సరీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంపై గ్రామ కార్యదర్శి ప్రియాంకపై కలెక్టర్ తీవ్రంగా మందలించారు. సర్పంచ్, ఎంపీవో, గ్రామ కార్యదర్శిలు పూర్తి బాధ్యతలు వహించి గ్రామానికి అవసరమైన 5 వేల మొక్కలను సిద్ధం చేయాలన్నారు. లేనిచో సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్బంగా బసిరెడ్డిపల్లి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వంద శాంతం టాక్స్ కలెక్షన్ చేయడం హరిగిందని, ప్రతి రోజు పారిశుధ్య పనులతో పాటు వివిధ సదుపాయముల కొసం జీపీ నిధులతో సమకుర్చడం జరుగుతుందని గ్రామ కార్యదర్శి కలెక్టర్ కు తెలియజేసినారు. గ్రీన్ బడ్జెట్ ఖర్చు, మిగులు నిధుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారిని రేణుక దేవి, డి ఆర్ డి ఓ కృష్ణన్, టిఎస్ఈడబ్ల్యూఐడిసి డిప్యూటీ ఇంజనీర్ రాజు, పరిగి తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, ఎంపీడీఓ శేషగిరి శర్మ, మండల విద్యాధికారి హరిశచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.