అంగ రంగ వైభవంగా తీజ్ సంబరాలు..

Published: Monday July 25, 2022
పాలేరు జూలై 24 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని మంగాపురంతండా(చిన్నతండా) లో ఆదివారం తీజ్ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతీ ఏడాది నిర్వహించే తీజ్ లో వందల మంది గిరిజనులు పాల్గొన్నారు. నానబెట్టిన విత్తనాల మొలకలను యువతులు ఎత్తుకుని పూజలు నిర్వహించారు. వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఆటా, పాటలతో సందడి చేశారు. పవర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జీఎస్టీ సూపరిండెంట్ జగన్నాయక్, రైల్వే మెటీరియల్ సూపరిండెంట్ శ్రీకాంత్, రైల్వే పోలీస్ అధికారి సురేందర్, ధీరవత్ కోటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ తేజావత్ అనిత, ఎంపీటీసీ అరుణ. కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు ధీరావత్ రాధాకృష్ణమూర్తి, గిరిజన సంఘం నాయకులు పాల్తియా
 
శ్రీనివాసరావు, పాల్తియ రాజా తదితరులు పాల్గొన్నారు |