ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నూతన ఇంచార్
తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన ఇంచార్జ్ మాణిక్ రావు టాక్రే ని మర్యాదపూర్వకంగా కలిసిన శాలువా కప్పి సన్మానించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు & టిపిసిసి సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లో 50 సంవత్సరాలు ఉన్నవారికి అసెంబ్లీ ఎన్నికలలో సీటు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇంచార్జ్ మణిక్ రావు టాక్రే ను కలసి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మర్రి నిరంజన్ రెడ్డి మంతనాలు జరిపారు, ఇబ్రహీంపట్నం లో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న వ్యక్తులను గుర్తించాలని ఆయనను కోరారు. కాంగ్రెస్ పార్టీ మొక్కపోకుండా అహర్నిశల్ కంటికి రెప్పలా కాపాడుతూ ప్రజలను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించే విధంగా కృషి చేస్తామని మర్రి నిరంజన్ రెడ్డి తెలిపారు,
Share this on your social network: