మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లతో

Published: Wednesday July 07, 2021
మధుర, జులై 06, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ స్థానిక మధిర మార్కెట్ కార్యాలయంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు మాట్లాడుతూ రానున్న పత్తి మిర్చి వంటల ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళికగా డైరెక్టర్ తో చర్చించడం జరిగింది మరియు మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి 5 చెక్ పోస్టులులైన ఎర్రుపాలెం బోనకల్లు రాజుపాలెం ఆత్మకూరు మధిర లోకల్ చెక్ పోస్ట్ లు ద్వారా వచ్చే ఆదాయం గురించి మార్కెట్ కమిటీ బడ్జెట్ గురించి బోర్డు మెంబర్స్ తో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మరియు మార్కెట్ కమిటీ కార్యదర్శి చౌదరెడ్డి బి లక్ష్మణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు