సిటిఓ యాప్ ద్వారా పంటలను నమోదు చేయాలి
Published: Friday March 10, 2023
* జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ నిరంజన్ రావు
వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన :
వికారాబాద్ మండలం, మదన్ పల్లి గ్రామంలో సి టి ఓ యాప్ ద్వారా పంటల వివరాల నమోదు చేయడం జరుగుతుందని జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ నిరంజన్ రావు అన్నారు. ఇందులో భాగంగా గురువారం వికారాబాద్ మండలం మదనపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 239, 240 లలో రైతు జె.నర్సింలు, తండ్రి రామయ్య అలాగే డి.రాములు, తండ్రి అంతయ్య పొలాలలో సర్వే నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. సర్వే నిర్వహించేందుకు వచ్చినప్పుడు రైతు, ప్రజలు సిపిఓ అధికారులకు సహకారం అందించాలని ఆయన కోరారు. సి పి ఓ తో పాటు ఎంపీ ఎస్ ఓలు మురళి, మల్లేశం, రైతులు పాల్గొన్నారు.
Share this on your social network: