ఘనంగా టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ.నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకలు

Published: Tuesday March 16, 2021

మధిర, మార్చి15, ప్రజాపాలన ప్రతినిధి : వసంతమ్మ మానసిక సేవా కేంద్రంలో 50Kg ల బియ్యం,నిత్యావసర సరుకుల అందించారు అలానే పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి అనంతరం కేక్ఎం్ కట్ చేసిపీ నామ్ నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మధిర పట్టణంలో వినాయకుడి గుడి వద్ద అన్నదానం చేయడం జరిగింది నేడు టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సంధర్భంగా సోమవారం నాడు నామ నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకలను మధిర లోని డా.వసంతమ్మ మానసిక వికలాంగుల సేవా కేంద్రంలో టీ.ఆర్.ఎస్ యూత్ నాయకులు *తాళ్లూరి హరీష్ బాబు* ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత గారు, మధిర ఎంపీపీ మొండెం లలిత గారు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు గారు, మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు గారు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు గారు, మొండితోక సుధాకర్ గారు,కనుమూరి వెంకటేశ్వరరావు గారు, శీలం వెంకటరెడ్డి గారు, అరిగా శ్రీనివాసరావు గారు, గోకర్ల చంద్రం గారు, మాదాల రామారావు గారు, చావా వేణు గారు, యూత్ నాయకులు నరేంద్ర రెడ్డి గారు, యర్రగుంట రమేష్ గారు, కృష్ణ నాయక్ గారు, రాయుడి భద్రయ్య గారు, ఉమ గారు తదితరులు పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి ఎంపీ నామ నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ సేవా సాధనం లో ఉంటున్న మానసిక వికలాంగుల విద్యార్థులకు వారికి అవసరమైన నిత్యావసర సరుకులను, 50 kg ల బియ్యం అందించారు అలానే ఎంపీ గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. అలానే పట్టణంలోని వినాయకుడి గుడి వద్ద అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొండితోక సుధాకర్ గారు, మాదాల రామారావు గారు, గోకర్ల చంద్రం, రాయుడి భద్రయ్య గారు తదితరులు పాల్గొన్నారు.