కమ్మ సంఘం మధిర వారి ఆధ్వర్యంలో ఎంపీ పుట్టినరోజు వేడుకలు
Published: Wednesday March 16, 2022
మధిర మార్చి 15 ప్రజాపాలన ప్రతినిధి : పరిధిలో మంగళవారం నాడు చెరుకూరు నాగార్జున ఇంటి దగ్గర కమ్మ సామాజిక వర్గం ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ నామా ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నామ సేవలను కొనియాడారుమంచి మనసు ప్రజల ఆదరాభిమానాలను ఉన్న మనిషి ప్రజాసేవకే అంకితం చేసిన మన పార్లమెంటు సభ్యులు వారు వారి కుటుంబం నిండు నూరేళ్ళు ఉండాలని కమ్మ సామాజికవర్గ నాయకులు తెలిపారు, ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం పెద్దలు శ్రీ కృష్ణ ప్రసాద్, గడ్డం రమేష్, గడ్డం శ్రీను, గడ్డం భద్రయ్య, చెరుకూరు నాగార్జున రావు, చిరుమామిళ్ల రాము, అయితం వెంకటేశ్వరరావు, మేడ వెంకటేశ్వరరావు, మాదల రామారావు, మాదల రాంబాబు, రాయుడు భద్రయ్య ఇతర సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసినారు.
Share this on your social network: