సిపిఐ సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ యలమధి వెంకయ్య 47వ వర్ధంతిని

Published: Monday November 29, 2021
మధిర నవంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ యలమధి వెంకయ్య 47వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా వారి స్మారక స్థూపాన్ని కి వెంకయ్య కుమారుడు రాము పూల దండ వేయగా జెండాను సిపిఐ సీనియర్ నాయకులు కనక పూడి గురవయ్య జెండా ఎగరవేశారు. వెంకయ్య గారి చిత్రపటానికి సిపిఐ మధిర మండల కార్యదర్శి ఓట్ల కొండలరావు సహాయ కార్యదర్శి చావా మురళి కృష్ణ పూలదండ వేసి నివాళులర్పించారు. నివాళులు అర్పించినవారిలో రైతు సంఘం మండల అధ్యక్షులు పంగ శేషగిరిరావు, మండల కార్యవర్గ సభ్యులు మంగళగిరి రామాంజనేయులు, మడుపల్లి సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి రంగు నాగ కృష్ణ ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ మండల నాయకులు sk కొండ మడపల్లి శాఖ నాయకులు గడిపూడి సీతయ్య మల్లవరపు గోపి కాసిన వెంకటేశ్వర్లు నాగేశ్వరరావు ఓట్ల శ్రీనివాసరావు అప్పారావు తదితరులు నివాళులర్పించారు.