మల్లాపూర్ లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఎంపిక

Published: Monday June 21, 2021
మల్లాపూర్, జూన్ 20 (ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఆదివారం ఆధ్యక్షులు రుద్ర రాంప్రసాద్‌ అధ్యక్షత మల్లాపూర్ మండలంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో కమిటీని ఎన్నుకున్నారు. నూతన లయన్స్‌ క్లబ్‌ ఆధ్యక్షులుగా ఏనుగు రాంరెడ్డి, ఉపాధ్యక్షులుగా తోట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సాదుల వెంకటస్వామి, కోశాధికారిగా బోయిని సిద్దయ్య, పిఅర్ఓ లుగా ముత్యాల రమేష్, రంగు రమాగౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమకమైన అధ్యక్షులు రాంరెడ్డి మాట్లాడుతూ లయన్ ఎస్టిక్ 2021-22 సంవత్సరం గాను తనను ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రతి లైన్స్ సభ్యుడికి అభినందనలు తెలుపుతూ, ప్రతీ గ్రామంలో లయన్స్ క్లబ్ సేవలను విస్తరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చార్టర్ ప్రెసిడెంట్ దేవ మల్లయ్య, తోట రాజారాం, కనుక సంజీవ్, నత్తి నర్సయ్య, నల్ల రాజన్న, పెంటపర్తి అశోక్. తదితరులు పాల్గొన్నారు.