అధికారిక కార్యక్రమంలో ఎంపీడీవో ఎమ్మార్వో కు అగౌరవం

Published: Thursday August 25, 2022

ప్రజా పాలన 23.నవాబు పెట్ మండల్ కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ , షాదీ ముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మండల మండల ఉన్నత అధికారులైన ఎమ్మార్వో రాజేందర్ రెడ్డి ఎంపీడీవో శ్రీలత డిప్యూటీ తాసిల్దార్ నికిత రెడ్డి లకు సీట్లు  కేటాయించకపోవడంతో కార్యక్రమం అయిపోయే వరకు నిలబడి ఉన్నారు. మండల ఉన్నతాధికారులైన వారికి సీటు కేటాయించకపోవడం ఎంతవరకు సమంజసం సంబంధిత మండల ఉన్నతాధికారులకు ఈ గౌరవం దక్కితే ఎలా అని కొందరు అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు.