పుస్తకాల పంపిణీ
Published: Friday July 30, 2021
పరిగి, 29 ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, దోమ మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ లో ఎంపీటీసీ బంగ్లా అనిత యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీటీసీ బంగ్లా అనిత మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి చదువుకునే రోజులు వచ్చినందు వలన ప్రతి ఒక్క విద్యార్థి ఇంటి దగ్గర శ్రద్ద తో ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొనీ విద్యను అభ్యసించాలని ఎంపీటీసీ అనిత యాదయ్య గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నిర్మల ఉపాధ్యాయులు రమేష్, గోవర్దన్, పాల్గొన్నారు.
Share this on your social network: