ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పి ఎం.నారాయణ
Published: Friday July 23, 2021
వికారాబాద్ 22 జూలై ప్రజాపాలన బ్యూరో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉంటడం వల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్ పి ఎం నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరెంటు ట్రాన్స్ఫరమ్స్, స్తంభాలను ముట్టుకోకూడదని సూచించారు. చిన్నపిల్లలను దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. పాడుబడ్డ ఇండ్లల్లో ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. గ్రామాలకు వెళ్ళే రోడ్లు, రహదారులు, పొలాలకు వెళ్ళే బాటలు కొట్టుకో పోయే అవకాశం ఉందని చెప్పారు. ఏదైనా ప్రాంతంలో రోడ్లు, వంతెనలు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందికర పరిస్థిది ఏర్పడినచో పోలీస్ అధికారులకు తెలపాలని కోరారు. చెరువులు, కుంటలు, వాగులు నీటితో నిండి ఉప్పొంగుతుంటాయి, వాగులు ప్రమాద స్థాయిలో పరుగులు పెడుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు. పాడు పడ్డ బావులు, చుట్టూ కంచె లేని బావుల దగ్గర జాగ్రతగా ఉండాలని తెలిపారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లు అయితే ప్రజలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారులకు గాని డైల్ 100 కు గాని ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పి తెలిపినారు. వర్షం నీటితో రోడ్లు పూర్తిగా తడవడంతో వాహనాలు రోడ్ల పైన జారీ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. వాహనదారులు నెమ్మదిగా తమ గమ్యాలను చేరుకొని ప్రమాదాలను నిర్మూలింంచుటకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుటకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. జిల్లా ప్రజల సంక్షేమంలో కూడా పోలీస్ అధికారులు ఎల్లపుడూ ముందు వరసలో ఉంటారని గుర్తు చేశారు.
Share this on your social network: