అభివృద్ధి పథంలో బస్వాపురం పంచాయతీ.. అభివృద్ధికి సర్పంచ్ లక్ష్మీనారాయణ ప్రత్యేక శ్రద్ధ..
Published: Tuesday September 13, 2022
తల్లాడ, సెప్టెంబర్ 12 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడ మండలంలోని బస్వా పురం గ్రామపంచాయతీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. గ్రామ సర్పంచ్ సూరంపల్లి లక్ష్మీనారాయణ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, వర్షాకాలం సీజన్ కావడంతో పారిశుద్ధ్య పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా గ్రామంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు సోకకుండా ఎప్పటికప్పుడు దోమల మందును పిచికారి చేయించడం, గ్రామపంచాయతీ సిబ్బందితో పారిశుద్ధ్యన్ని మెరుగుపరచటం లాంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. అదేవిధంగా పల్లె ప్రకృతి వనాన్ని సుందరగా తీర్చిదిద్దారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సూరంపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు.
Share this on your social network: