రైతు బీమా అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్
Published: Friday September 17, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన పిట్టల రాములు అనే రైతు ఇటీవల మృతి చెందగా మృతుని కొడుకు పిట్టల నరేష్ కు ఐదు లక్షల రూపాయల విలువగల చెక్కును ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ చేతుల మీదుగా అందజేసినారు. అనంతరం ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రైతు బంధు సహాయం ఇవ్వడమే కాకుండా రైతు మరణిస్తే రోడ్డున పడకుండా రైతు బీమా ను కూడా అందివ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, సర్పంచ్ సరదా లింగారెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావు, సర్పంచ్ దారిశెట్టి రాజేష్ సింగిరెడ్డి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: