భారత్ బంద్ విజయవంతం చేద్దాం : జిల్లా కెవిపిఎస్ కార్యదర్శి ఆర్.మహిపాల్
Published: Monday September 27, 2021
వికారాబాద్ బ్యూరో 26 సెప్టెంబర్ ప్రజాపాలన : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని జిల్లా కెవిపిఎస్ కార్యదర్శి ఆర్.మహిపాల్ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కెవిపిఎస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వివరించారు. దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు దళితుల పైన దాడులు హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జరగబోయే భారత్ బంద్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు సుదర్శన్ జిల్లా నాయకులు లక్ష్మణ్ హరికృష్ణ రమేష్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: