తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

Published: Wednesday September 14, 2022

వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్ బ్యూరో 13 సెప్టెంబర్ ప్రజా పాలన : ఈ నెల 16నుండి18 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న "తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల"ను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో "తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల" ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 16వతేది నుండి 18వ తేది వరకు నిర్వహించనున్న "తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల" ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో మరియు నియోజవర్గ స్థాయిలో మూడు రోజుల పాటు జరిగే వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించెందుకు నోడల్ అధికారులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఈ సందర్బంగా ప్రకటించారు. వికారాబాద్ నియోజకవర్గంలో జిల్లా యువజన క్రీడల అధికారి, వికారాబాద్ డి యస్ పి, ఆర్డిఓ ను, పరిగి నియోజకవర్గంనకు డిఆర్డిఓ, పరిగి తహసీల్దార్, అదనపు యస్పి లను, తాండూర్ నియోజకవర్గంనము గిరిజన సంక్షేమ శాఖ అధికారి, తాండూర్ ఆర్డిఓ, డిఎస్పి, కొడంగల్ నియోజకవర్గంనకు జడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, డి యస్ పి లను నోడల్ ఆఫీసర్లుగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 16న కలెక్టర్ కార్యాలయం నుండి బ్లాక్ గ్రౌండ్స్ వరకు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేసినారు. ప్రజా ప్రతినిధులు, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా గ్రూప్ సభ్యులు, ఏ యన్ యం లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది అందరు, అంగన్వాడీలు, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. పరిగి నియోజకవర్గంలో కొడంగల్ X రోడ్డు నుండి మినీ స్టేడియం వరకు, తాండూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విలెమూన్ స్కూల్ వరకు అలాగే కొడంగల్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీలు నిర్వహించాలన్నారు. బహిరంగ ర్యాలీలో ఏలాంటి అపశృతులు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి నియోజకవర్గమునకు 14 వేల చొప్పున జెండాలు అందించడం జరుగుతుందన్నారు. ఇట్టి జెండాలను మున్సిపల్ అధికారులు కర్రలు పెట్టి ర్యాలీలో పాల్గొంటున్న వారందరికీ అందజేయాలని సూచించారు. బ్లాక్ గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభలో అందరికి భోజనాలతో పాటు వాటర్ బాటిల్స్ అందించాలని తెలియజేసినారి. 17న జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని, జిల్లా కేంద్రంలో ముఖ్య అతిధి

పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.

పతాకావిష్కరణ తరువాత విద్యార్థులతో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేసినారు. అలాగే హైదరాబాద్ లోని ఎన్టిఆర్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ఎస్.టి. అధికారులు, సిబ్బంది, ఎస్.టి. వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి సభకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి మండలానికి ఒక వాహనము చొప్పున అవసరమైన వాహనాలను, తాగునీరు, భోజన వసతి ఏర్పాట్లను చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేసినారు. ఇట్టి వాహనాలు ఉదయం 8:00 గంటలకు బయలుదేరుతాయని సూచించారు. ప్రతి బస్సులో మండలాల వారిగా ఒక ఎంపీడీఓ, ఎంపీవో, పోలీస్ కానిస్టేబుల్ ఉంటారని తెలియజేసినారు.

18వ తేదిన కలెక్టర్ కార్యాలయం లేదా అంబేద్కర్ భావనములో కళాకారులతో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఇట్టి ఉత్సవాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములై వాజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను కోరారు.-ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి హన్మంత్ రావు, జిల్లా వైద్య అధికారి పాల్వాన్ కుమార్,వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓ లు,ఎంపీవో లు, మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.