చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లపై కెసిఆర్ పోరాడాలి. ..ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బిసి కులాల పోరా

Published: Saturday February 04, 2023
జన్నారం, ఫిబ్రవరి 03, ప్రజాపాలన: చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించుటకై ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బిసి కులాల పోరాట సమితి కన్వీనర్ కోడూరి చంద్రయ్య డిమాండ్ చేశారు.
శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వసంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వలన వందలాది బీసీ కులాల వారు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా  ఎదగలేక పోతునరన్నారు. గత 75 ఏళ్లుగా పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ బిజెపి పార్టీల స్వార్థ సంకుచిత రాజకీయాల వలన ఇలా జరుగుతుందన్నారు.  కార్మికులు, రైతు కూలీలు, రైతులు ఉద్యమాల ద్వారా నే హక్కులు సాధించుకోవడం, సమస్యలు పరిష్కరించుకోవడం అనేది జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2001 లో ప్రారంభించి 2014లో సాధించగలిగారన్నారు.  బీసీ కులాల వారికి రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ ను తీసుకొని ముందుకు వెళితే 60 శాతం బీసీ కులాల జనాభా గల అత్యధిక కులాల వర్గాల వారిని ఆకర్షించి జాతిపితగా అవతరించే అవకాశం అతి సమీపంలో ఉందన్నారు. జాతీయస్థాయిలో బీసీ కులాల వారు చైతన్యవంతులవుతే త్వరలో జాతీయస్థాయిలో మార్పు రాగల  అవకాశాలు ముందుగా ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బీసీ సంఘ పోరాట సమితి నాయకులు కే ఏ నరసింహులు, కాసెట్టి లక్ష్మణ్, ఆడేపు లక్ష్మీనారాయణ, శ్రీరాముల గంగాధర్, మామిడి విజయ్, అయిలవేణి నరసయ్య, దండవేణి చంద్రమౌళి, సిరవేణి పెద్దిరాజం, మూల భాస్కర్ గౌడ్, జంగం సంతోష్, తదితరులు పాల్గొన్నారు.