కంటి ఆపరేషన్లు పూర్తి చేసుకున్న వారికి పండ్లు, బ్రెడ్ పంపిణీ

Published: Friday November 26, 2021

వెల్గటూర్, నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) : లయన్స్ క్లబ్ ఆఫ్ వెల్గటూర్ ఆధ్వర్యంలో ఈ నెల 23 న జరిగిన నేత్ర వైద్య శిబిరంలో 75 మందిని శస్త్ర చికిత్సలకు గుర్తించడం జరిగింది. వీరిలో మొదటి విడుతలో 26 మందికి రేకుర్తి కంటి ఆసుపత్రి లో ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. వారిని ఇళ్లకు పంపించే ముందు వెల్గటూర్ లో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. లయన్ మెంబర్ గుంత కిరణ్ (చిరు మెడికల్ షాప్) దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అతని సౌజన్యంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సామ ఎల్లారెడ్డి, అధ్యక్షుడు మద్ది మురళీధర్, కార్యదర్శి వైద్య వెంకట్, కోశాధికారి గట్ల రాజేందర్,  ఉపాధ్యక్షుడు సిరిపురం తిరుపతి, పి ఆర్ ఓ నక్క సురేష్, డైరెక్టర్స్ పెద్ది శ్రీనివాస్, బండారి చంద్రమౌళి, తిప్పర్తి భూమయ్య, గాదాసు రాజేందర్, గోలి వంశీ, స్థానిక సర్పంచ్ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.