తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోనియాకి పాలాభిషేకం

Published: Thursday June 03, 2021
పాలేరు, జూన్ 2, ( ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా:-:నేలకొండపల్లి మండల కేంద్రంలో  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగ్గా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ మాట్లాడుతూ భారత దేశం కోసం తమ కుటుంబంలో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని కోల్పోయారన్నారు. గతంలో భారత ప్రధాని పదవి సహితం తృణప్రాయంగా వదులుకున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియమ్మకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం పని చేయాలన్నారు. పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానంతో వచ్చిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కోసం అమరవీరుల కుటుంబాలను ఇంతవరకు ఆదుకోకపోవడం చాలా బాధాకరమాని, తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. తెలంగాణ వచ్చిన దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన ఇంటికొక ఉద్యోగం ఆ హామీలు తుంగలోకి తొక్కారన్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండలం యువజన కాంగ్రెస్ నాయకులు గొలుసు పవన్, కాసాని సతీష్, వెంకటేష్, సమ్మెట శివ గణేష్, తదితరులు పాల్గొన్నారు