ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి *ప్రతిష్టించిన దుర్గమాత పూజ కార్యక్రమా

Published: Friday September 30, 2022
గురువారం రోజున  ఇబ్రహీంపట్నం నియోజకవర్గo *ఆదిభట్ల మున్సిపాలిటీపరిధిలోని కొంగర కాలన్  లో ప్రతిష్టించిన దుర్గామాత పూజా కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ & భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి  , మరియు టి పి సి (A బ్లాక్) సభ్యులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి  పూజా కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు  నిర్వాహకులు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ *దుర్గామాత ఆశీస్సులతో* ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, సిరిసంపదలతో, పాడి పంటలతో , సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు హరిదాసు గౌడ్, వనం శ్రీనివాస్,నాయకులు మర్రి రామ్ రెడ్డి, కుంట్ల ఉదయపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ పంతులు, విరా స్వామి గౌడ్,శ్రీనివాస్ గౌడ్, నిర్వాహక కమిటీ సభ్యులు ,భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.