3 లక్షల ఎల్వోసిని అందజేసిన - ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్

Published: Friday September 17, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): సారాంగాపూర్ మండల్ రేచపల్లి గ్రామానికి చెందిన బింగి గంగవ్వ గుండె సంబంధిత వ్యాధితో భాదపడడంతో శస్త్ర చికిత్స ఆర్థిక సహాయం కోసం జగిత్యాల ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ ను గ్రామ తెరాస నాయకులతో కలవగా ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ కు విషయం తెలియజేయగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 3 లక్షల రూపాయల ఎల్వోసిని గురువారం రోజున తెరాస పార్టీ కార్యాలయంలో శాసన మండలి విప్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు జగిత్యాల ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత చేతుల మీదుగా గంగవ్వ తండ్రి నర్సయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ డా: చంద్రశేఖర్ గౌడ్ జడ్పీటిసి మేడిపల్లి మనోహర్ రెడ్డి గుర్రాల రాజేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ కొనాపూర్ ప్యాక్స్ డైరెక్టర్ శేఖర్ గౌడ్ ఉప సర్పంచ్ రాజేశం నాయకులు ఎండబెట్ల ప్రసాద్ మల్లేశం పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్ తదితరులు పాల్గొన్నారు.