గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తం

Published: Tuesday July 27, 2021
ఇబ్రహీంపట్నం, జూలై 26 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని గ్రామాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఈరోజు ప్రాజెక్టు గేట్లు ఏ సమయంలోనైనా తెరిచే అవకాశం ఉన్నందువల్ల గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గొర్ల, బర్ల కాపరులు మరియు చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లరాదని, ఎవరు అయినా ఆపదలో ఉంటే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని ఎస్సై  డి. నినిషా రెడ్డి  తెలిపినారు.