నిత్యావసర సరుకులు పంపిణీ

Published: Friday June 25, 2021

బెల్లంపల్లి, జూన్ 24, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం కోణం పేట గ్రామంలో నిరుపేదలైనా 10 కుటుంబాలకు నిత్యవసర సరుకులు బియ్యము అందించినట్లు ఆల్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ జాయింటు యాక్సన్ కమిటీ మరియు ముస్లిం మైనార్టీ యూత్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనంపేట గ్రామంలో నిరుపేద పది కుటుంబాలకు నెన్నెల హేడ్ కానిస్టేబుల్ షైక్ చాంద్, స్ధానిక సర్పంచు తిరుపతి రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు అన్వర్ ఖాన్ చేతుల మీదుగా నిరుపేద కుటుంబాలకు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందిని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోడిపే శంకర్, రమేష్, శ్రీనివాస్, మురళి, ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటి మరియు ఆల్ ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ సభ్యులు అన్వరుద్దీన్, మొహమ్మద్ రఫీ, ముహమ్మద్ ముస్తఫా, ముహమ్మద్ జాఫర్, ఆల్ ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ సభ్యులు రషీద్ ఖాన్, అష్రాఫ్ అలీ, ఫెరోజ్ ఖాన్, ఉబేద్, గజ్జల సందీప్ తదితరులు పాల్గొన్నారు.