5లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
Published: Tuesday April 20, 2021
మేడిపల్లి, ఏప్రిల్19 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 20వ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో మున్సిపల్ జనరల్ ఫండ్ నిధుల నుంచి రూ 5లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణపు పనులకు స్థానిక కార్పొరేటర్ కౌడే పోచయ్య, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ తో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాపోలు లక్ష్మ రెడ్డి, కాలనీ వాసులు కుర్ర అంజయ్య, హన్మంత రావు, నరేందర్, వెంకటేష్ చారి,మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: