శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వెండి కవచం విరాళం

Published: Friday September 30, 2022

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): మండలం లోని వర్షకొండ గ్రామం లో గల పురాతన మైన  శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారికి అజ్ఞాత భక్తుడు సుమారు అరవై వేల విలువైన వెండి కావచ్చని విరాళంగా సమర్పించారు. ఇట్టి కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ దొంతుల శ్యామల తుక్కారం, ఎంపీటీసీ చిన్న వెంకట్, ఉప సర్పంచ్ మంగిలిపల్లి లక్ష్మన్,గ్రామ కమిటీ సభ్యులు దోమకొండ రాజన్న, నర్సయ్య, శ్యాం,చిన్న భూమన్న,గంగాధర్,మద్దనపల్లి నాగేష్ చారి, జోగ ధనంజయ   శ్రీనివాస్, ఆలయ అర్చకులు మధుర అన్వేష్ చార్యులు పాల్గొన్నారు.