డివిజన్లో అభివృద్ధి పనులను చేపట్టాలని వినతి

Published: Saturday December 24, 2022
మేడిపల్లి, డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్లో నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శాంతినగర్లో అత్యవసరంగా బాక్సు డ్రైన్ నిర్మించాలని, అవసరమున్న చోట కొత్త పోల్స్, దోబీ ఘాట్ మరియు ఈ సేవ సెంటర్ దగ్గర ప్రాంగణం మొత్తం పచ్చదనంగా నిర్మించాలని, బాలకృష్ణ నగర్ మరియు కామాక్షి పురంలో సీసీ రోడ్డుల విషయంపై స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు జోనల్ కమిషనర్ పంకజను కలిసి చర్చించి  వినతిపత్రం అందజేశారు. ఈ విషయాలపై స్పందించిన జోనల్ కమిషనర్ సంక్రాంతి తర్వాత పనులన్నీ చేపడతామని, శాంతినగర్లో బాక్స్ డ్రైన్ ఎస్ఎన్డిపి రెండవ విడుదల అనుమతి వస్తుందని తెలియజేశారు.