గుండి రాజేశ్వర ఆలయంలో జడ్పిటిసి ప్రత్యేక పూజలు **
Published: Monday February 20, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 18 (ప్రజాపాలన,ప్రతినిధి) :
ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలోని రాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ని పురస్కరించుకుని బి ఆర్ ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి,జడ్పీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షులు శ్రీ అరిగెల నాగేశ్వర్ రావు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నం వండించారు. కార్యక్రమానికి సింగిల్ విండో చైర్మన్ ఆలీ బిన్ అహ్మద్,మాజీ ఎంపీటీసీ రవీందర్,మాజీ సర్పంచ్సెండే దత్తు, వార్డు మెంబర్లు మల్లేష్ యాదవ్,మోహన్,భగవంతు కొండయ్య, రవి,సాగర్, భీమ్రావు, బురుగుడా మాజీ సర్పంచ్ గాజుల సత్యనారాయణ,రాము గౌడ్, కోట వెంకన్న ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
Share this on your social network: