మున్సిపల్ సిబ్బందితో పిచ్చి మొక్కలను తొలగిస్తున్న కార్పొరేటర్ మహేశ్వరి కృపసాగర్

Published: Saturday July 03, 2021
మేడిపల్లి, జూలై 2 (ప్రజాపాలన ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ శుక్రవారం మున్సిపల్ సిబ్బందితో డివిజన్లోని పలు కాలనీలలో పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మహేశ్వరి కృపసాగర్ మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రతే ధ్యేయంగా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం డివిజన్లోని సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని తెలిపారు.