భారతదేశంలో సంక్షేమ పథకాలు అందించడంలో ఏకైక మన కేసీఆర్ జడ్పీ చైర్మన్

Published: Monday September 05, 2022
మధిర సెప్టెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆసరా కార్డులు పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ భారత దేశంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఏకైక మొనగాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అని లింగాల కమల్ రాజు కొనియాడారు. ఒక్క రామకృష్ణ పురం గ్రామంలోని 540 మంది కి అందుతున్నాయని 366 పాతవారికి,182 మంది కొత్తవారికి కలిపి 548మంది లబ్ధిదారులకు ప్రతి నెలా 11, లక్షల 39, వేల 200 రూపాయలు, మన ఒక్క గ్రామానికి  సంవత్సరానికి 1,కోటి 39, లక్షల,2000/-రూపాయలు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజలంతా ఆలోచించుకొని కి మన ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గట్టిగా చెప్పారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్  కుటుంబరావు, నిర్మల, కన్నెభోయిన సీతారామయ్య, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీ ను, శెట్టి మోహన్ రావు,శె  ట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు
 
 
 
Attachments area