బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలి. బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చి

Published: Monday December 20, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని పింగళి శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆదివారం (19 12 2021) నాడు ఎర్రుపాలెం మండల కమిటీ కార్యవర్గ సమావేశం ఎర్రుపాలెం మండల బిజెపి అధ్యక్షుడు ముక్కపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ మండల కమిటీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యులు చిలివేరు సాంబశివరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు దిశానిర్దేశం చేయడం జరిగినది. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలని బూత్ స్థాయి కమిటీలు గురించి మాట్లాడడం జరిగింది. అదేవిదంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి పథకాల గురించి, తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలును గ్రామ స్థాయి నుండి ఎండగట్టాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టువంటి బిజెపి నాయకులు రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నూతక్కి నరసింహారావు, మరియు ఖమ్మం జిల్లా దళిత మోర్చా అధికార ప్రతినిధి దేవరకొండ కోటేశ్వరరావు మరియు ఖమ్మం జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి పుప్పాళ్ళ చంద్రమౌళి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మిర్యాల నాగేశ్వరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు కావేటి ధనలక్ష్మి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాము గౌడ్, మోక్ష అధ్యక్షుడు కన్నా రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి పిట్టలగోపాల్, మండల ఉపాధ్యక్షుడు బొక్క రమేష్, ఈశ్వరయ్య, ఎస్సీ సెల్ కార్యదర్శ ఇపనునూరి రామయ్య, ఇత్తడి కృష్ణ, ఇనగాలి గ్రామ అధ్యక్షుడు అచ్చేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు పింగళి శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు.