ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి

Published: Friday April 16, 2021
మధిర ప్రజా ప్రతినిధి 15వ తేదీఉచిత మాస్కులు పంపిణీ చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లవరం MPTC మందడపు నాగేశ్వరరావు కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ విధిగా మాస్కులు ధరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మందడపు నాగేశ్వరరావు కోరారు. గురువారం మండల పరిధిలోని మల్లారం ఎస్సీ కాలనీ లోని అంగనవాడి సెంటర్ నందు గ్రామస్తులకు ఉచిత మాస్కూలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో,  రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలని సూచించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ  ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, ఈవో ఆర్ డి రాజారావు, సర్పంచ్ ఉపేందర్ రావు, సిపిఐ మధిర మండల నాయకులు చావా మురళీకృష్ణ, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.