మాతా, శిశు కేంద్రంను వినియోగంలోకి తీసుకురావాలి

Published: Tuesday February 08, 2022
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 7, ప్రజాపాలన : ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జిల్లాలోని కాలేజ్ రోడ్డులో నిర్మిస్తున్న ఆసుపత్రి నిర్మాణ పనులను ఈ నెల 15వ తేదీ లోగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైన సామాగ్రి, పరికరాలు సమకూర్చడంతో పాటు ఆసుపత్రి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రి వరకు మంజూరైన అంతర్గత రహదారి నిర్మాణానికి సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.ఎన్.ఎం. ఎన్.ఐ.డి.సి. ఈ.ఈ. ఎ.రవీందర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు  పాల్గొన్నారు.