స్మశాన వాటికపై శ్రద్ధ..... స్థానిక కార్పొరేటర్

Published: Friday July 02, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజా పాలన : వైకుంఠధామంలో చెత్త వేయొద్దు, చెత్తను చెత్త బండి లోని వెయ్యాలని స్థానిక కార్పొరేటర్ కాలనీవాసులకు వివరించారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కుర్ములగూడ వైకుంఠధామంలో గురువారం నాడు గుంతలు, చెత్త, లేకుండా పరిశుభ్రం చేస్తున్న కార్పొరేటర్ బోద్రమౌని రోహిణి రమేష్ ముదిరాజ్. వారు మాట్లాడుతూ.... పట్టణ ప్రగతి కార్యక్రమం భాగంలో స్మశాన వాటిక లో చెత్త వేయొద్దని, అలా వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ చెత్తను చెత్త బండిలో మాత్రమే వేయాలని, ఆ బండి మీ ఇంటి వద్దకు రాకపోతే మాకు కంప్లైంట్ ఇవ్వాలని అన్నారు. వైకుంఠధామం లో పరిశుభ్రత కలిగి ఉండాలని కాలనీవాసులతో అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్ భర్త రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.