స్వచ్ఛంద లాక్ డౌన్ పెట్టాలి : మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం

Published: Tuesday May 04, 2021
మధిర, మే 3, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో కరోనా వైరస్ సెకండ్ వెవ్ తీవ్రంగా ఉంది. దీనిమూలంగా పట్టణంలో అనేక మంది మరణిస్తున్నారు. దీనిమీద అన్ని రాజకీయపక్షాలు బాధ్యతగా సమావేశమై చర్చించగా, మధిర వరకు లాక్ డౌన్స్వచ్ఛందంగా నిర్వహించుటకు, అన్ని రాజకీయ పక్షాలను, స్వచ్ఛంద సంస్థలను, మీడియాను, పోలీస్, రెవెన్యూ శాఖలను మీ ద్వారా సమన్వయపరిచి మధిర పట్టణంలో కరోనా తీవ్రత తగ్గటానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ ప్రయత్నం మీ ద్వారా నిర్వహించాలని కోరుతూ బాధ్యతాయుతంగా మధిర. పట్టణ, మండలం రాజకీయ  అఖిలపక్ష నాయకులు కోరుతున్నాము. ఈ వినతిపత్రాన్ని చైర్ పర్సన్ గారు అందుబాటులో లేని కారణంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఈ రోజు అఖిలపక్షం నాయకులు అందచేశారు.ఈ కార్యక్రమంలో, మధిర మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంసెట్టి కిశోర్, మిరియాల రమణ గుప్తా, CPI నాయకులు బెజవాడ రవి బాబు, CPM నాయకులు శీలం నరసింహారావు, బిజెపి నాయకులు పాపట్ల రమేష్, YSRTS నాయకులు S.నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు విరమచినేని శ్రీనివాసరావు, మధిర పట్టణ కాంగ్రెస్ నాయకులు షైక్ జహంగీర్ మొదలగు వారు పాల్గొన్నారు....