స్మశాన వాటిక చుట్టుపక్కల చెత్తాచెదారం తొలగింపు

Published: Friday September 24, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : చిల్కానగర్ డివిజన్లోని స్మశాన వాటిక ప్రాంతంలో చెత్త పెరిగిపోయిందని స్థానిక ఎస్సీ సంఘం ప్రతినిధులు డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కు తెలియజేయడంతో వెంటనే స్పందించిన కార్పొరేటర్ జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి జెసిబితో స్మశాన వాటిక చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా శుభ్రం చేయించడం జరిగింది. స్థానిక ఎస్సీ సంఘం ప్రతినిధులు అడిగిన వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేసినందుకు కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎదుల కొండల్ రెడ్డి, కొకొండ  జగన్, సుభాష్, బిట్టు, కర్ణకర్,సంతోష్, తదితరులు పాల్గొన్నారు.