ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Published: Thursday December 22, 2022
మేడిపల్లి, డిసెంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ విఎన్ఆర్ గార్డెన్స్ లో హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రీ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
 ముఖ్య అతిథిగా ఆర్చ్ బిషప్ కార్డినల్ పూల ఆంతోని పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ
నిరుపేదలు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలను నిర్వహిస్తుందని,అందుకే పేద కుటుంబాల్లో ఆనందం కోసం కానుకలు అందిస్తుందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, రామంతాపూర్ మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్వాయి మధుసూదన్ రెడ్డి, బన్నాల ప్రవీణ్  ఉప్పల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,వివిధ డివిజన్ల నాయకులు,క్రైస్తవ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.