విద్యుత్ షాక్ తో ముప్పై గేదెలు మృతి

Published: Monday June 28, 2021

జన్నారం, జూన్ 27, ప్రజాపాలన ప్రతినిధి : జన్నారం మండలం లోని రోటి గూడ గ్రామంలో విద్యుత్ షాక్ తో ముప్పై గేదలు మృతి చెందాయి, ఆదివారం ఉదయం గేదెలు మేత కొరకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో విద్యుత్ వైరు తెగి గేదెలకు తగలడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 గేదెలు మరణించడంతో గేదెల యజమానులు కన్నీటిపర్యంతమయ్యారు తమ గేదెలకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.