శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిని నిర్మించండి...
Published: Wednesday February 02, 2022
సారంగాపూర్, ఫిబ్రవరి 01 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ కొనపూర్ గ్రామ సరిహద్దుల్లో ఉన్న జగిత్యాల నుంచి కోనాపూర్ సారంగాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో ప్రమాదం తీవ్ర స్థాయికి చేరింది. జగిత్యాల జిల్లా సంబంధిత అధికారులకు ఎన్ని సార్లు విన్నవించిన స్పందన లేదని వాపోయారు. మంగళవారం రోజున బీజేపీ సారంగాపూర్ మండల అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ధీటి వెంకటేష్ ముద్దం శ్రీనివాస్ ఆనంతుల స్వామి వంగపెళ్లి పవన్ ఉదయ్ భాను ప్రణయ్ పాల్గొన్నారు.
Share this on your social network: