వంశీకి నివాళులర్పించిన తుమ్మలపల్లి రమేష్..
Published: Tuesday October 11, 2022
తల్లాడ, అక్టోబర్ 10 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని నరసింహారావుపేట గ్రామానికి చెందిన గోపిశెట్టి వంశీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ తల్లాడ మండల నాయకులు తుమ్మలపల్లి రమేష్ సోమవారం నరసింహారావుపేటలో వంశీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వంశీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో గోగినేని తిరుమలరావు, కోసూరు రామారావు, సూద నాగేశ్వరరావు, పులి నరసింహారావు, లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.
Share this on your social network: