వంశీకి నివాళులర్పించిన తుమ్మలపల్లి రమేష్..

Published: Tuesday October 11, 2022
తల్లాడ, అక్టోబర్ 10 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని నరసింహారావుపేట గ్రామానికి చెందిన గోపిశెట్టి వంశీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న   టిఆర్ఎస్ తల్లాడ మండల నాయకులు తుమ్మలపల్లి రమేష్ సోమవారం  నరసింహారావుపేటలో వంశీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వంశీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో గోగినేని తిరుమలరావు, కోసూరు రామారావు,  సూద నాగేశ్వరరావు, పులి నరసింహారావు, లక్ష్మణరావు  తదితరులు ఉన్నారు.