విద్యాసంస్థల బంద్ విజయవంతం
Published: Thursday July 21, 2022
మధిర జులై 20 ప్రజా పాలన ప్రతినిధివిద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ పిడిఎస్యూ వామపక్ష విద్యార్థి సంఘాల
ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా తలపెట్టిన విద్యాసంస్థల బంద్ మండలంలో విజయవంతం అయింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ పిడిఎస్యు జిల్లా కోశాధికారి ఆకుల కిరణ్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందించలేద న్నారు. విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు రెండు జతలు యూనిఫాం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్క విద్యార్థిని కూడా యూనిఫామ్స్ ఇవ్వలేదని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్లు పోస్టులు భర్తీ చేయలేదని, ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి కోసం మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టినట్లు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో ఎక్కడ అమలు కాలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను పూర్తి చేయలేదని గత రెండు సంవత్సరాల నుంచి విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా నాయకులు యంగల ఉజ్వల్ కొంగర నరేంద్ర మండల నాయకులు వంశీ సాయి వెంకట్ గోపి నవీన్ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: