భూ బాదితులకు సమస్యలు పరిష్కరించాలి

Published: Friday March 03, 2023

శంకరపట్నం మార్చి 03 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో గురువారం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీహారి సింగ్ జాతీయ రహదారి (563) భూ సేకరణ నష్టపోతున్నా రైతుల భూములకు పరిహారం అందని వారి వివరాలు సేకరించి సమస్యలపై విచారణ జరిపి రైతు కుటుంబలాలో ఏమైనా సమస్య ఉంటే వారి కుటుంబ  సభ్యులందరితో మాట్లాడి త్వరితగతముగా సేకరణ పనులను పూర్తి చేయలని తహసిల్దార్ కార్యాలయములో ఎమ్ఆర్ఓ శ్రీనివాస్ రావు, కార్యాలయ సిబ్బందితో ఆర్డిఓ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.  ఈ కార్యక్రమములో నయాబ్ తహశీల్దారు శ్రీకాంత్, గిర్దవార్లు లక్ష్మారెడ్డి,  అరుణ, సీనియర్ అసిస్టెంట్ శ్రీలత పాల్గొన్నారు.