తల్లాడలో ఘనంగా కనకదుర్గమ్మ ఊరేగింపు..

Published: Saturday October 08, 2022
 తల్లాడ, అక్టోబర్ 7 (ప్రజాపాలన న్యూస్):
 
దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి కనకదుర్గమ్మ అమ్మవారిని తల్లాడ పట్టణంలో ఊరేగించారు. చివరిరోజు ఆలయ కమిటీ చైర్మన్ పస్తం రంగారావు (గురుస్వామి) ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో భారీర్యాలీ నిర్వహించారు. ఆంధ్రా నుంచి వచ్చిన వివిధ కళాకారుల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు ఎస్ కే ఈసుబ్, ఉద్యమ నాయకులు బొడ్డు వెంకటేశ్వరరావు, నంబూరు మోహన్ రావు, భూమా ప్రసాదు, పస్తం మద్దిరామయ్య, గుండ్ల సురేష్, పాల్గొన్నారు.