సేవయే మా లక్ష్యం సేవ యే మా మార్గం

Published: Monday October 11, 2021
మధిర, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో, మధిర సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక 18వ వార్డు నందు ముఖ్య అతిథి కౌన్సిలర్ శ్రీమతి అరిగే రజిని, అరిగే శ్రీనివాసరావు దంపతులు చేతుల మీదుగా శ్రీ మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు గారి ఇంటి దగ్గర అత్యంత నిరుపేద కుటుంబాలకు వివిధ రకాల పనుల నిమిత్తం బయటికి వెళ్లినప్పుడు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఎండకు, వానకు, రక్షణ కొరకు దాత లార్విన్ గ్రూప్ డైరెక్టర్ చిరంజీవి మిరియాల దినేష్ ఆర్థిక సహకారంతో "గొడుగులు" పంపిణీ చేసినార ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ముఖ్య అతిధి శ్రీమతి అరిగే రజిని మాట్లాడుతూ మధిర సేవా సమితి సేవా కార్యక్రమాలను కొనియాడుతూ పేదలకు ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందించడంలో మధిర సేవా సమితి ముందు ఉంటుందని తెలిపారు పేదలకు సేవ చేయడం అంటే భగవంతుడికి చేసిన పుణ్యంలో ఒక భాగమని తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పల్లపోతు ప్రసాదరావు, మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, చారు గుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి, యర్రా లక్ష్మణ్, కోమటి సుధాకర్, బసవరాజు వాసుదేవరావు, షేక్ జహంగీర్, దూపుకుంట్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు