ఎస్ టి యు నుండి టీఎస్ యుటిఎఫ్ లోకి చేరిక

Published: Tuesday November 16, 2021
బోనకల్, నవంబర్ 15 ప్రజా పాలన ప్రతినిధి : బోనకల్ మండలంలోని గోవిందాపురం ఎల్ గ్రామంలో రెండు ప్రాధమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న అంబటి మోహనరావు, జెల్లా కోటయ్య, ఎస్టీయూ సంఘం నుండి టీయస్ యూటీఎఫ్ లో చేరారు. యూటీఎఫ్ చేస్తున్న పోరాటాలకు, సర్వీస్ కు ఆకర్షితులమై సంఘంలో చేరుతున్నట్లు వారు అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీయస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు మాట్లాడుతూ విద్యారంగం మరియు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు యూటీఎఫ్ చేస్తున్న ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, పైరవీలతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు.సమస్యల పరిష్కారం కొరకు యూటీఎఫ్ చేస్తున్న పోరాటాలకు మద్దతు ప్రకటిస్తూ ఎస్టీయూ నుండి యూటీఎఫ్ లో చేరి సభ్యత్యం స్వీకరించిన మోహనరావు, కోటయ్య లను అభినందించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్సులు బి ప్రీతం, గుగులోతు రామకృష్ణ, మండల నాయకులు కంభం రమేష్, సద్దా బాబు, పిగోపాల్ రావు, పివి అప్పారావు, శివనరసింహారావు, ఎం సి ఆర్ చంద్ర ప్రసాద్, పీనరసింహారావు, పి సుశీల, కే అనిల్ కుమార్, సౌభాగ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.