రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి* చేవెళ్ల నియోజకవర్గం (బ్యూరో)ప్రజాపాలన

Published: Saturday November 05, 2022
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
శంకర్పల్లి మండలం రావులపల్లి కలాన్ గ్రామానికి చెందిన మనీలా భర్త మల్లేష్ పని నిమిత్తం బైకుపై మండల కేంద్రానికి వచ్చారు పని పూర్తి చేసుకుని వారి గ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకొని బయటకి వస్తుంటే ఓవర్ స్పీడ్ తో ఉన్న సిమెంట్ ట్యాంకర్ వీరి బైకును బలంగా ఢీకొట్టింది. మల్లేష్ భార్య మనీలా తలపై నుండి లారీ చక్రాలు వెళ్లడంతో తలభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది మృతురాలి భర్త మల్లేష్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వెంబడే లారీ నీ ఆపి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.