సీనియర్ పాత్రికేయులు తేనె వెంకటేశ్వర్లును పరామర్శించిన సిపిఎం జిల్లా నాయకులు ప్రాణాపాయం
Published: Saturday August 20, 2022
బోనకల్, ఆగస్టు 19 ప్రజా పాలన ప్రతినిధి: మండల ప్రముఖ సీనియర్ నవతెలంగాన రిపోర్టర్ తేనె వెంకటేశ్వర్లు గురువారం రాత్రి పది గంటల సమయంలో చాతి నొప్పితో బాధపడుతూ అస్వస్థతకు గురై ఖమ్మంలో ని ప్రముఖ హాస్పిటల్ ఆరోగ్య లో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న సీపీఎం నాయకులు శుక్రవారం హాస్పిటల్ కి వెళ్లి తేనె వెంకటేశ్వర్లును పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. తేనె వెంకటేశ్వర్లుకు ప్రాణాపాయం తప్పి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు వై విక్రమ్ ,చింతలచెర్వు కొటేశ్వరరావు, జిల్లా నాయకులు చింతల రమేష్, బోనకల్ మాజీ జడ్పీటీసీ ,ఎంపీపీ కొమ్ము. శ్రీనివాసరావు,ఇరుగు వేంకటేశ్వర్లు,సీపీఐ జిల్లా నాయకులు తోట రామాంజనేయులు,తదితరులు పరామర్శించారు.
Share this on your social network: