మధిర మండలంలో లో పలు కార్యక్రమాలు హాజరైన జడ్ చైర్మన్ లింగాల

Published: Tuesday February 22, 2022
మధిర ఫిబ్రవరి 21 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం పరిధిలో సోమవారం నాడు పలు కార్యక్రమాల్లో భాగంగా రామచంద్రపురం రొంపి మల్ల వంగవీడు గ్రామాలలో పర్యటించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మొదటిగా రామచంద్రపురం గ్రామంలో నూతనంగా మంజూరైన సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు అనంతరం రోంపిమల్ల గ్రామంలో నూతనంగా మంజూరైన సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారుఅనంతరం వంగవీడు గ్రామంలో మిర్చీ కోసే వ్యవసాయ కూలీ రైతులతో యోగక్షేమాలు అడిగి ముచ్చటించారు అనంతరం వంగవీడు గ్రామంలో సి సి రోడ్డు శంకుస్థాపన వెళ్లిన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి గ్రామ సర్పంచ్  ఆధ్వర్యంలో యువత బ్రహ్మరథం పట్టారు, అనంతరం గ్రామంలో నూతనంగా మంజూరైన సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మధిర మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.