భూపతిపూర్ గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి

Published: Saturday June 04, 2022

రాయికల్, జూన్ 03 (ప్రజాపాలన ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ఐదో విడత కార్యక్రమాన్ని భూపతిపూర్ గ్రామంలో రాయికల్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గ్రామ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఉపసర్పంచ్  అన్నవేణి వేణు, వార్డు సభ్యులు, ఎం.పి.టి.సి మరియు ప్రజలతో కలిసి  పాదయాత్ర చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభనిర్వహించారు